అమీన్ పీర్ దర్గా

Update: 2019-04-28 11:26 GMT

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా.అన్ని మతాల ప్రజలూ సందర్శించే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ దర్గా అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది.పర్యాటకులు, అలాగే స్థానికులు దర్గాకు విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని, అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి వస్తారు.ఈ దర్గాలో సాధువుల సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థించడం ద్వారా కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం.

ఈ ఇద్దరు సాధువుల వారసులు కూడా ఈ మందిరంలో పని చేస్తున్నారు. వేరే సిబ్బంది నుండి వీరిని గుర్తించేందుకు కాషాయ దుస్తులు ధరిస్తారు. వీరు కాషాయ రంగు టోపీలనే ఈ ఇద్దరు సాధువుల భక్తులు ధరిస్తారు. ప్రవక్త మహమ్మద్ వారసుడు పీరుల్లా హుస్సైని అని ఎక్కువ మంది నమ్మకం. దేశంలోని అన్ని సూఫీ సాధువుల దర్గాలని సందర్శించే ఆయన అజ్మీరు విన్నపం మేరకు కడపలో స్థిరపడ్డారు.

 

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్