జనవరి నుంచి సౌ పౌలోకు ఎమిరేట్స్ సర్వీసులు

Update: 2020-12-21 04:41 GMT

బ్రెజిల్ లోని ప్రముఖ ఆర్ధిక కేంద్రం సౌ పౌలోకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తన సర్వీసులను ప్రారంభించనుంది. అది కూడా అత్యంత విలాసవంతమైన ఎయిర్ బస్ ఏ380 విమానాలతో. ఈ విషయాన్ని ఎమిరేట్స్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లంచింది. 2021 జనవరి నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దుబాయ్ నుంచి ఈ విమాన సర్వీసులు వారంలో నాలుగు సార్లు నడవనున్నాయి.

జనవరి 9 నుంచి 30 మధ్యలో ఇవి ఉంటాయని తెలిపారు. వచ్చే వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని పెరిగే ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. 2020 మార్చిలో కరోనా కారణంగా సర్వీసులు రద్దు చేసిన తర్వాత మళ్ళీ వీటిని పునరుద్ధరించటం ఇది మొదటిసారి అని తెలిపింది.

Tags:    

Similar News