విమానాశ్రయంలో 'చెక్ ఇన్' అయితే వంద కట్టాల్సిందే

Update: 2020-10-18 04:36 GMT

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయంలో చెక్ ఇన్ కావాలంటే ప్రతి ప్రయాణికుడు విధిగా వంద రూపాయలు సర్వీసు ఛార్జ్ కట్టాల్సి ఉంటుందని ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దేశంలో చెక్ ఇన్ కు ఛార్జీ వసూలు చేస్తున్న ఎయిర్ లైన్స్ గా ఇండిగో రికార్డుల్లోకి ఎక్కింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వెబ్ చెక్ ఇన్ ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇండిగో వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వెబ్ చెక్ ఇన్ కావాలని ప్రయాణికులకు సూచించారు. కరోనా వైరస్ దృష్ట్యా 'టచ్ పాయింట్స్' ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందునా వచ్చేది పండగల సీజన్ కావటంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇండిగో చెక్ ఇన్ కు వంద రూపాయల ఛార్జీ వసూలు నిర్ణయం తీసుకోవటం విశేషం.

Tags:    

Similar News