పర్యాటకానికి మాల్దీవులు గ్రీన్ సిగ్నల్

Update: 2020-06-23 15:19 GMT

ఫస్ట్ దుబాయ్. ఇప్పుడు మాల్దీవులు. కరోనా సంక్షోభం తర్వాత ఒక్కొక్కటిగా పర్యాటకులకు గేట్లు తెరుస్తున్నాయి. జులై 15 నుంచి మాల్దీవులు పర్యాటకుల కోసం సరిహద్దులను ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సొలిహ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా మార్చి 27న మాల్దీవుల సరిహద్దులను మూసివేశారు. ఇప్పుడు పర్యాటకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

Similar News