సెప్టెంబర్ 30 వరకూ రెగ్యులర్ రైళ్ళు రద్దు

Update: 2020-08-10 12:42 GMT

రైల్వే శాఖ మరోసారి సర్వీసుల రద్దును పొడిగించింది. గత కొన్ని నెలలుగా ఎప్పటికప్పుడు రైల్వే సర్వీసుల రద్దును పొడిగిస్తూ పోతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుముఖం నమోదు కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ మెయిల్, ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్భన్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగించారు. అయితే ప్రత్యేక మెయిల్, ఎక్స్ ప్రెస్ సర్వీసులు మాత్రం యథాతధంగా కొనసాగనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది.

Similar News