శంషాబాద్ విమానాశ్ర‌యంలో తొలి ద‌శ విస్త‌ర‌ణ పూర్తి

శంషాబాద్ విమానాశ్ర‌యంలో  తొలి ద‌శ విస్త‌ర‌ణ పూర్తి

శంషాబాద్ విమానాశ్ర‌యం విస్త‌ర‌ణ తొలి ద‌శ ప్రాజెక్టు ప్రారంభానికి రెడీ అయింద‌ని జీఎంఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. · ప్రయాణీకుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా ఈ విమానాశ్ర‌యాన్ని 34 మిలియన్ల మందికి మించి ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేలా విస్తరిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త రూట్ డెవలప్‌మెంట్‌తో మెరుగైన కనెక్టివిటీ, ఎయిర్ ట్రాఫిక్‌లో పెరుగుదల, కొత్త రన్‌వే స్లాట్‌ల కోసం డిమాండ్ కూడా విమానాశ్రయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయని తెలిపారు. విస్తరించనున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌సైడ్, ల్యాండ్‌సైడ్ ప్రాంతంలో అదనపు మౌలిక సదుపాయాలతో ఇప్పటికే ఉన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌తో (కాన్‌కోర్స్ & పయర్స్ వద్ద) ఇంటిగ్రేట్ చేయబడుతుంది. పునరుద్ధరించిన ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ విస్తీర్ణం 379,370 చదరపు మీటర్లకు పెరుగుతుంది. ఇందులో 149 చెక్-ఇన్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. విస్తరించిన దేశీయ, అంతర్జాతీయ పయర్ భవనాలలో మరిన్ని లాంజ్‌లు, రిటైల్, ఫుడ్ అండ్ బ్రీవ‌రేజ్ అవుట్‌లెట్‌లు ఉంటాయి.

తూర్పు, పశ్చిమ పయర్ భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు జోడించడంతో, 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 4 కొత్త రాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలను (RETలు) జోడించారు. ఈ RETలు విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుండి టాక్సీ ఆఫ్ కావడానికి వీలుగా రూపొందించబడ్డాయి. దీని వల్ల రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, రన్‌వే సామర్థ్యం పెరుగుతుంది.సెకెండరీ రన్ వే ని ఉపయోగించుకునే సందర్భంగా సమర్థవంతమైన ఆపరేషన్ కోసం ఒక కొత్త ప్యారలల్ ట్యాక్సీవేను నిర్మించారు. మొదటి దశ విస్తరణలో భాగంగా, ఈస్ట్ పయర్ (స్ట్రైట్) పోర్షన్ ఏరియాను ప్రయాణికుల కోసం త్వరలో ప్రారంభించనున్నారు. మూడు స్థాయిలలో 15,742 చదరపు మీటర్లలో విస్తరించి, కొత్తగా విస్తరించిన ఈ టెర్మినల్ భాగం ప్రస్తుత టెర్మినల్‌తో అనుసంధానించబడుతుంది. ప్రయాణికులు విమానంలోకి బోర్డింగ్ మరియు డిస్-ఎంబార్కింగ్ కోసం 3 నూతన ఎయిరోబ్రిడ్జీలు పని చేయడం ప్రారంభిస్తాయి. కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం, 6 ఈ-గేట్‌లు (ప్రతి బోర్డింగ్ గేట్‌కు 2) ఉంటాయి, వీటి ద్వారా ప్రయాణీకులు భద్రతా తనిఖీల కోసం వెళ్లి, ఆపై తక్కువ సమయంలో ఫ్లైట్ ఎక్కవచ్చు, తద్వారా వెయిటింగ్ టైమ్, బోర్డింగ్ ప్రక్రియ తగ్గుతుంది.

ఈస్ట్ పయర్ స్ర్టెయిట్ విభాగంలో 6 డొమెస్టిక్ అరైవల్ బస్ గేట్లు ఉంటాయని తెలిపారు. ప్రయాణీకులకు సౌలభ్యం, భద్రత కోసం ఈస్ట్ పయర్ స్ట్రెయిట్ పోర్షన్‌లో రెండు స్థాయిల్లో మూడు ట్రావెలేటర్లు (ఆటోమేటెడ్ ప్యాసింజర్ వాక్‌వేలు) ఉంటాయి. దీని వల్ల ఈస్ట్ పయర్ గుండా నడిచే ప్రయాణీకులు విమానం ఎక్కేందుకు నడిచే అవసరం తప్పుతుంది· భారతదేశంలోని విమానాశ్రయ చరిత్రలో మొదటిసారిగా GSE టన్నెల్, ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ సపోర్ట్ ఆపరేషన్స్ వెహికల్స్, ఎక్విప్‌మెంట్, ప్యాసింజర్ కోచ్‌ల కదలికల వల్ల కలిగే సమయాన్ని తగ్గిస్తుంది, ఫలితంగా ఇంధన ఆదా, తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గి, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పర్యావరణ అనుకూల విమానాశ్రయంగా మారుతుంది. కొత్తగా నిర్మించిన ఈ GSE టన్నెల్‌తో సుమారు ఏడాదికి 7000 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.


Similar Posts

Recent Posts

International

Share it