మ‌న‌కూ ఓ మాల్దీవులు

మ‌న‌కూ ఓ మాల్దీవులు

మాల్దీవులు. సెల‌బ్రిటీలు..ప‌ర్యాట‌కులు ఎంతో ఇష్ట‌మైన ప్రాంతం. క‌రోనా లేని రోజుల్లో అయితే మాల్దీవుల‌కు వెళ్ళే వారిలో భార‌త వాటా కూడా చాలా ఎక్కువే. క‌రోనా స‌మ‌యంలో కూడా చాలా మంది అటువైపే వెళ్లారు. నెల‌ల కొద్దీ అక్క‌డే గ‌డిపారు. అయితే ఇప్పుడు భార‌త్ ప‌ర్యాట‌కుల‌కు ఓ శుభ‌వార్త‌. దేశంలో కూడా ఓ మాల్దీవులు రాబోతుంది. అచ్చం మాల్దీవుల్లో ఉన్న త‌ర‌హాలోనే ఇక్క‌డ సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌నున్నారు. లక్షద్వీప్ ఇందుకు కేంద్రంగా మార‌బోతుంది. లక్షద్వీప్ దేశంలోని ఓ కేంద్ర పాలిత ప్రాంతం అన్న విష‌యం తెలిసిందే.ఇక్క‌డ 800 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో అచ్చం మాల్దీవుల త‌ర‌హాలోనే నీటి విల్లాలు డెవ‌ల‌ప్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ స‌మ‌గ్ర అధ్య‌య‌నం త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇవి పూర్తి అయితే దేశంలోని సంప‌న్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప‌ర్యాట‌కుల‌ను ఈ ప్రాంతం విశేషంగా ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంద‌నే అంచనాలు ఉన్నాయి. లక్షద్వీప్ లోని మూడు ప్రాంతాల‌ను ఈ త‌ర‌హా విల్లాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అందులో మినీకాయ్, క‌ద్ మ‌త్, సుహేలి దీవులు ఉన్నాయి. నీతి అయోగ్ సిఫార‌సుల మేర‌కు స‌ముద్ర‌తీర ప్రాంతాల ద్వారా అద‌న‌పు ఆదాయ వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌లో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.అయితే కొత్త ప్రాజెక్టుల కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంంటి న‌ష్టం చేయ‌కుండా చూడ‌టంతో పాటు స్థానికుల ఉపాధి అవ‌కాశాలు పెంచ‌టంతో..దేశంలోమ‌రింత మెరుగైన ప‌ర్యాట‌క వ‌స‌తులు అందుబాటులోకి తేవాల‌నే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

Similar Posts

Recent Posts

International

Share it