లేహ్ -జమ్మూ మార్గంలో విమాన సర్వీసులు ప్రారంభం

లేహ్ -జమ్మూ మార్గంలో విమాన సర్వీసులు ప్రారంభం

పర్యాటకులకు స్వర్గథామం జమ్మూకాశ్మీర్ ప్రాంతం. గుడ్ న్యూస్ ఏంటి అంటే లేహ్ జమ్మూ మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించారు. కరోనాతో అన్ని చోట్ల ఆగినట్లే ఈ ప్రాంతానికి కూడా విమాన సర్వీసులు ఇటీవల వరకూ ఆగిపోయాయి. ఇప్పుడు లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే ఆదివారంతోపాటు బుధవారాలు, శుక్రవారాలు మాత్రమే ఈ సేవలు నడుస్తున్నాయి.

లద్ధాఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎల్ ఏహెచ్ డీసీ) వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శీతాకాలంలో లేహ్ నుంచి మనాలీ వెళ్ళే మార్గంతోపాటు శ్రీనగర్ మార్గం కూడా మంచుతో మూతపడుతుంది. దీంతో ప్రజలు ఒక్క విమాన మార్గం ద్వారానే ఆయా ప్రాంతాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it