విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు

విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు

కరోనా తగ్గుముఖం పడుతుంది అని అందరూ రిలాక్స్ అవుతున్న తరుణంలో దేశంలో మళ్ళీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతోంది. దీంతో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విమాన ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానంలో మాస్క్ తప్పనిసరి ధరించాల్సిందే. అది కూడా ముక్కు కూడా పూర్తిగా కవర్ అయ్యేలా ఉండాలి. ఎవరైనా కోవిడ్-19 నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది. పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని ' నిషేధిత జాబితాలో చేరుస్తామని డీజీసీఏ హెచ్చరించింది.

విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన్నంాతసేపు అన్ని సమయాల్లో మాస్క్‌ లను కచ్చితంగా ధరించాల'ని పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్‌ లను తీయవద్దని డీజీసీఏ సూచించింది. విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్‌ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది.

Similar Posts

Recent Posts

International

Share it