అంతర్జాతీయ విమాన సర్వీసులకు శ్రీలంక ఓకే

అంతర్జాతీయ విమాన సర్వీసులకు శ్రీలంక ఓకే

శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించనున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ శ్రీలంక (సీఏఏఎస్ఎల్) ప్రకటించింది. చార్టెడ్ విమానాలతోపాటు వాణిజ్య విమాన కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఎనిమిది నెలల తర్వాత శ్రీలంక అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఓకే చెప్పింది. శ్రీలంకలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మార్చి మధ్యలోనే మూసేశారు. అక్టోబర్ లోనే శ్రీలంకలో కరోనా రెండవ వేవ్ వచ్చింది. అందుకే పలు దేశాలకు చెందిన వారిని వెనక్కి పంపే ప్రక్రియను కూడా వాయిదా వేసింది.

ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండటంతో త్వరలోనే పర్యాటకులను కూడా అనుమతించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమెరికాతోపాటు యూరప్ లో వ్యాక్సినేషన్ ప్రారంభం అయినందున పర్యాటకులకు కూడా త్వరలోనే ఎయిర్ పోర్టులు ఓపెన్ చేస్తామన్నారు. శ్రీలంకలో ఇప్పటివరకూ 32135 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 22 వేల మంది రికవరీ కాగా, 8000 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it