గుత్తి కోట

Update: 2019-04-28 12:16 GMT

గుత్తి కోట, గూటీలో మైదానాల పైన 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అతి పురాతన కొండ కోటల్లో ఒకటి. ఈ కోటను విజయనగర రాజ్యానికి చెందిన చక్రవర్తులు నిర్మించారు. మురారి రావు ఆధ్వర్యంలో మరాఠాలు దీనిని జయించారు. తర్వాత 1773 సం.లో హైదర్ ఆలీ ఆక్రమించాడు. చివరికి 1799 సం.లో టిప్పు సుల్తాన్ పరాజయం తర్వాత బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. కోటను ఒక చిప్ప(షెల్) ఆకారంలో నిర్మించారు. నిర్మాణం లోపల 15 ప్రధాన తలుపులు(ముఖద్వారాలు)తో 15 కోటలు ఉన్నాయి. ఇక్కడి పెవిలియన్ ఒక కొండ అంచున ఉంది. దీని నుండి చుట్టుపక్కల పరిసరాలను ఒక విస్తృత దృశ్యంతో చూడగల ..కెమెరాల సహాయంతో బంధించగల అవకాశము ఉంది. ఇంతటి ఎత్తులో ఉన్నా నీటి వనరుల లభ్యత ఉండటం ఈ కోట ఏకైక విశేష లక్షణం.

 

Similar News

పెనుకొండ