పుట్టపర్తి

Update: 2019-04-28 11:59 GMT

భారత దేశంలోనే కాదు..విదేశాల్లోనూ ‘పుట్టపర్తి’ అంటే తెలియని వారు ఉండరు. దీనికి ప్రధాన కారణం సత్య సాయిబాబా. ఆయన పుట్టిన ప్రాంతం కూడా ఇదే. సాయిబాబా నివాసం ఉండే ప్రాంతాన్నే ‘ప్రశాంతి నిలయం’గా పిలుస్తారు. సత్యసాయిబాబా తనకు వచ్చిన విరాళాలతో ఆ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల ఆదరణ పొందారు. ప్రశాంతి నిలయం అంటే ‘‘మహోన్నత శాంతి యొక్క దామం’’ అని భావిస్తారు చాలామంది భక్తులు. జీవించి ఉన్నప్పుడు సత్యసాయి ఈ ఆశ్రమంలో ప్రతిరోజూ వేలాది మంది తన భక్తులకు దర్శనం ఇచ్చేవారు.సత్యసాయి బాబా ‘‘సాధారణంగా జూన్ మొదలు నుండి మార్చి మధ్య వరకు ప్రశాంతి నిలయంలో ఉండేవారు. ఆయన గతించిన తర్వాత ఇక్కడి సాయి కుల్వంత్ హాల్‌లో సమాధి చేయబడ్డారు. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు ఖచ్చితంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సందర్శించకుండా వెళ్ళరు.

అనంతపురానికి 79 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 

Similar News

గుత్తి కోట
పెనుకొండ